అంగన్ వాడీ కేంద్రంలో పిల్లలను చదివిస్తున్న కలెక్టర్..!

ఆర్థికంగా కొంచెం బాగుంటే చాలు.. పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలోనే చదివించుకుటుంన్నారు. ఇక ప్రభుత్వంలో పైస్థాయి ఉద్యోగులే కాదు.. కింది స్థాయి ఉద్యోగులు సైతం తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ స్కళ్లలో చదివిస్తుంటారు. ఎంత ఫీజు ఉన్నా.. అన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాలలకు పంపుతారు.. కానీ కొందరు అధికారులు మాత్రం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. 

తాజాగా కుమురం భీమ్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కూడా తన తన కుమార్తెలు నిర్వికరాజ్, రిత్వికరాజ్ లను అంగన్ వాడీ కేంద్రానికి పంపిస్తూ పలువురి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఇద్దరు చిన్నారులు జన్కాపూర్-1 కేంద్రంలో తోటి పిల్లలతో ఆడుతూపాడుతూ ఆనందంగా గడుపుతున్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ పిల్లలు మూడు నెలలుగా అంగన్ వాడీ కేంద్రానికి వస్తున్నారని, ఇక్కడే భోజనం కూడా చేస్తున్నారని అంగన్ వాడీ టీచర్ అరుణ తెలిపారు. పై ఫొటోలో ముందు వరుసలో కూర్చున్న ఇద్దరు చిన్నారలే కలెక్టర్ కుమార్తెలు..   

Leave a Comment