బాహుబలి మీల్స్.. పూర్తి చేస్తే రూ.8 లక్షలు.. ఎక్కడంటే..!

మీరు హీరో నాని నటించిన ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమా చూశారా.. అందులో ఓ కామెడీ సీన్ గుర్తుందా.. హోటల్ వారు పెట్టిన ఛాలెంజ్ ను కమెడియన్ ధనరాజ్ స్వీకరించి గెలుస్తాడు. ఏకంగా ఒక్కడే 50 పరోటాలు తిని పందెం గెలుస్తాడు. అచ్చం అలాంటి ఘటనే ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ లో నిజంగానే జరిగింది. ఓ ఇద్దరు యువకులు ‘బాహుబలి థాలీ’ తిని రూ.8 లక్షలు గెలుచుకున్నారు.. 

ఢిల్లీలోని కన్నాట్ లో ఉన్న ఆర్డోర్ 2.1 రెస్టారెంట్ ఓ ఫుడ్ ఛాలెంజ్ నిర్వహించింది. ఛాలెంజ్ ఏమిటంటే ఓ థాలీని భారీగా ఫుడ్ ఐటమ్స్ తో నింపుతారు. ఈ బాహుమలి థాలీని కేవలం 40 నిమిషాల్లో తినేయాలి. అలా తిన్న వారికి రెస్టారెంట్ వారు రూ.8 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించారు. ఈ సవాల్ ని ఇద్దరు స్నేహితులు స్వీకరించారు. 

థాలీలో ఏమున్నాయంటే:

ఈ బాహుబలి థాలీలో అనేక ఉత్తర భారతీయ వంటకాలు ఉన్నాయి. తమతర్ కా షోర్బా, పాప్డీ చాల్, గోభీ మటర్, దాల్ తడ్కా, కధీ పకోడా, ఆలూ పాలక్, మలై కోఫ్తా, సోయా చాప్ మసాలా, కధాయ్ పనీర్, దాల్ మఖానీ, దమ్ ఆలూ, సాగ్ మరియు పనీర్ టిక్కా మసాలా, వెబ్ బిర్యానీ, స్టీమ్డ్ రైస్, పలు రకాల రొట్టెలు ఈ థాలీలో ఉన్నాయి. పాపడ్, సలాడ్లు, రైతా, ఉల్లిపాయలు, జల్జీరా, రోజ్ షర్బత్, గులాబ్ జామూన్ కూడా ఈ బాహుబలి థాలీలో ఉన్నాయి. 

39 నిమిషాల్లో పూర్తి:

రజనీష్ జ్ఞానీ అనే యువకుడు బాహుబలి థాలీని తన స్నేహితుడితో కలిసి 39 నిమిషాల 52 సెకండ్లలో పూర్తి చేశాడు. ఫుడ్ ఛాలెంజ్ గెలవడంతో ఆర్డోర్ 2.1 రెస్టారెంట్ వారు రజనీష్ కి రూ.8 లక్షలు ప్రైజ్ మనీ ఇచ్చారు. దీంతో వారు సంబరాలు చేసుకున్నారు. అయిత ఆ ప్రైజ్ మనీని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. ఈ బాహుబలి థాలీ ఛాలెంజ్ కి సంబంధించిన 15 నిమిసాల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Leave a Comment