మదనపల్లెలో  అపశృతి.. జంతు బలికి బదులు నరబలి..!

మదనపల్లెలో దారుణం జరిగింది. జంతు బలికి బదులు మద్యం మత్తులో నరబలి ఇచ్చారు. ఈ ఘటన మండలంలోని వలసపల్లి సంక్రాంతి వేడుకల్లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల మేరకు గ్రామంలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి కనుమ పండుగను నిర్వహించారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఊరి పొలిమేరలో గ్రామదేవతకు జంతు బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.. 

ఇందులో భాగంగా తలారి లక్ష్మణ కుమారుడు తలారి సురేష్(35) పొట్టేలను పట్టుకుని ఉన్నాడు. తలారి చలపతి మద్యం మత్తులో పొట్టేలును నరకబోయి పొట్టేలును పట్టుకొని ఉన్న సురేష్ తల నరికేశాడు.. దీంతో సురేష్ అక్కడే కుప్ప కూలాడు. స్థానికులు సురేస్ ని మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య ,ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో గ్రామంలో సంక్రాంతి పర్వదినం విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న మదనపల్లె పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

 

Leave a Comment