ఇరాన్ లో ఒకే రోజు 49 మంది మృతి

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇరాన్ ను గడగడలాదిస్తుంది. ఒకే రోజు 49 మంది ప్రాణాలను బలిగొంది. గడిచిన 24 గంటల్లో 49 మంది మరిణించినట్లు ఆ దేశ అధికారులు ధ్రువీకరించారు. కాగా కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు ఆ దేశంలో మొత్తం 194 మంది మరణించారు. వైరస్ కారణంగా ఇరాన్ మాజీ దౌత్యాధికారి హోసేన్ షేఖోస్లామ్ ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే. ఆ వార్త మరువకముందే మరో ప్రజాప్రతినిధిని కరోనా కబలించింది. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఫతేమహ్ రహబర్ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ మీడియా కథనాలు వెల్లడించింది. 

(కరోెనా రాకుండా టిప్స్)

రహబార్ ప్రస్తుతం టెహ్రాన్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చైనా తర్వాత ఇరాన్ లోనే అత్యధికంగా కరోనా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు 194 మంది చనిపోగా, 5 వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు ఇటలీలోనూ కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆ దేశంలో కరోనా ధాటికి ఇప్పటి వరకు 234 మంది మరణించగా..1247 కరోనా కేసులు నమోదయ్యాయి. 

Leave a Comment