35 ఏళ్ల ప్రేమ సక్సెస్..65 ఏళ్ల వయసులో ప్రేయసి దక్కించుకున్న ప్రియుడు..!

మనిషి జీవితంలో ప్రేమ ఒక అనుభూతి.. ఒక తపన.. మనకంటూ ఒక మనిషి కావాలనే తపనే ప్రేమ.. తను ప్రేమించిన మనిషి కోసం ప్రేమికులు ఏదైనా చేస్తారు. ఎంత కాలమైన నిరీక్షిస్తారు.. ప్రేమ ఎంత బలమైందో చెప్పడానికి ఈ జంటే నిదర్శనం.. 35 ఏళ్ల క్రితం ప్రేమించుకుని.. అనుకోని కారణాలతో దూరమయ్యారు. ఇప్పుడు 65 ఏళ్ల వయస్సులో పెళ్లితో ఒక్కటయ్యారు..

మైసూర్ కి చెందిన హూపాల్ సిక్కన్న(65), జయమ్మ(65) గత 35 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. అయితే సిక్కన్నను జయమ్మను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. జయమ్మను మరొకరికి ఇచ్చి పెళ్లి చేశారు. 

అయితే ప్రేయసి దక్కలేదన్న ఆవేదనతో సిక్కన్న ఒంటరిగానే మిగిలిపోయాడు తప్ప మరెవ్వరినీ తన జీవితంలోకి రానీయలేదు. ఈక్రమంలో కొంత కాలానికి జయమ్మ భర్త చనిపోయాడు. ఆమెకు పిల్లలు లేరు. అప్పటి నుంచి ఇద్దరు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వేర్వేరుగానే ఉంటూ వచ్చారు.

చివరికి ఈ జంట 65 ఏళ్ల వయసులో సమాజాన్ని, కట్టుబాట్లను కాదని కర్ణాటకలోని మండ్య జిల్లా మేలుకోటె చెలెవనారాయణుడి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆశ్రమంలో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం సంప్రదాయం ప్రకారం ఆమెకు అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

 

 

Leave a Comment