జూదంలో భార్యను ఓడిన భర్త.. తిరిగొస్తే ఇంటి నుంచి గెంటేశాడు..!

ఉత్తరప్రదేశ్ లో ఓ భర్త తన భార్యపట్ల క్రూరంగా ప్రవర్తించాడు. భార్యను జూదంలో తాకట్టు పెట్టి ఓడిపోయాడు. ఆమె తప్పించుకుని ఇంటికి వస్తే త్రిపుల్ తలాక్ చెప్పి ఇంట్లో నుంచి గెంటేశాడు.. ఈ ఘటన బల్లియా ప్రాంతంలోని మనియార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోర్కెండ్ గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాలు మేరకు.. తస్మిన్ షేక్ అనే వ్యక్తి తన భార్యను తీసుకుని ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ తన భార్యను తాకట్టు పెట్టి జూదం ఆడాడు. జూదంలో ఓడిపోవడంతో భార్యను అక్కడే వదిలేసి ఢిల్లీ నుంచి పారిపోయాడు. అయితే భార్య ఎలాగోలా తప్పించుకుని బల్లియాలోని తన ఇంటికి చేరుకుంది. 

ఈక్రమంలో జూదంలో ఓడిపోయినందుకు రూ.2 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో ఆమె జిల్లా మెజిస్ట్రేట్ కి ఫిర్యాదు చేసింది. డబ్బులు ఇవ్వనందుకు త్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి బయటికి గెంటేశాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలని మెజిస్ట్రేట్ కి మొరపెట్టుకుంది.   

Leave a Comment