వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం

నెల రోజుల క్రితం ఏర్పాటు చేసిన మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా భామిని మండలం కొరమలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి సమయంలో విగ్రహాన్ని పెకిలించి కిందపడేశారు. విగ్రహం ధ్వంసం చేయడంపై గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు, వైసీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ విగ్రహాన్ని సెప్టెంబర్ 2న డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ ఆవిష్కరించారు. విగ్రహం ధ్వంసం కావడం పట్ల పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి, డీసీసీబీ చైర్మన్ విక్రాంత్ ఖండించారు. 

Leave a Comment