ప్రజా సేవలో 20 ఏళ్లు..

ప్రధాని నరేంద్ర మోడీ కీలక మైలురాయిని అధికమించారు. ప్రజాసేవకుడిగా మోడీ ప్రస్థానం ప్రారంభించి బుధవారంతో 19 ఏళ్లు పూర్తి చేసుకుని 20వ ఏట అడుగుపెట్టారు. 2001 అక్టోబర్ 7న తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయన ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. గుజరాత్ సీఎంగా 13 ఏళ్లు పని చేశారు. ఆ తర్వాత 2014 నుంచి భారతదేశ ప్రధానిగా కొనసాగుతూ వస్తున్నారు. 

ప్రపంచంలో ఎన్నికైన ప్రభుత్వాధినేతగా సుదీర్ఘకాలం పనిచేసిన వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకరు. ప్రభుత్వాధినేతగా 20వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నరేంద్ర మోడీకి పలువురు బీజేపీ నేతలు, మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. తన సుదీర్ఘ పదవీ కాలంతో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఫ్రాంక్లిన్ డి.రూజ్ వెల్ట్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ వంటి ప్రపంచ నాయకులతో మోడీ ఉన్నారు. 

Leave a Comment