బెస్ట్ సీఎంలలో వైఎస్ జగన్ కు మూడో స్థానం..!

దేశ్యవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన సీఎంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ నిలిచారు. జులై 15 నుంచి 27 మధ్య ఇండియా టుడే-కార్వి ఇన్ సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్ సీఎంల పనితీరుపై సర్వే నిర్వహించింది. 12,021 మందితో టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా అభిప్రాయాలు సేకరించింది. 19 రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. ఈ సర్వేలో ఏపీ సీఎం జగన్ కు మూడో స్థానం దక్కింది. 

కాగా రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(4), ఇతరులు(5), బిహార్ సీఎం నితిశ్ కుమార్(6), మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే(7), ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(8), రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్(10) స్థానాల్లో ఉన్నారు. 

Leave a Comment