హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ అదుపుతప్పి యువకుడు మృతి..

హైదరాబాద్ లోని అమీర్ పేట్ చౌరస్తాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి మెట్రో స్టేషన్ రైలింగ్ కు ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి… ఇద్దరు యువకులు ఖైరతాబాద్ వైపు నంచి బైక్ పై అతివేగంతో కూకల్ పల్లి వైపు బయల్దేరారు. 

అతి వేగంగా వెళ్తున్న బైక్ పంజాగుట్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు రాగానే అదుపు తప్పింది. దీంతో బైక్ మెట్రో రైల్ స్టేషన్ రైలింగ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడి తల రైలింగ్ లో ఇరుక్కుపోయింది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన యువకుడిని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.     

Leave a Comment