జగన్ కోసం ఆత్మాహుతికైనా రెడీ.. వైసీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు లక్ష్యంగా ఆయన కామెంట్లు చేశారు. జగన్ జోలికొస్తే.. తాను ఆత్మాహుతి దళంగా మారేందుకు సైతం సిద్ధమని వ్యాఖ్యానించారు. జగన్ జోలికి వస్తే ఎవరిని వదలబోమని హెచ్చరించారు. 

అచ్చెన్నాయుడి రాజకీయ పతనమే తన లక్ష్యమన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ కార్యకర్తల అంతు తేలుస్తామని అనడం దారుణమన్నారు. అంకుశం సినిమాలో విలన్ ని కొట్టనట్లు టెక్కలి రోడ్డుపై అచ్చెన్నాయుడును దొర్లించి, ఈడ్చి కొట్టకపోతే నా పేరు దువ్వాడ శ్రీనివాస్ కాదని ఛాలెంజ్ చేశారు. 

టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ అని అన్నారు. మహానాడులో ఇష్టానుసారంగా మాట్లాడిన వారిని ఆయన హెచ్చరించారు. జగన్ కోసం ప్రాణాలు అరపించేందుకైనా సిద్ధంగా ఉన్నానని, ఆత్మాహుతి దళంగా మారిపోతానని అన్నారు. తనకు ప్రాణాల మీద భయం లేదని, జీవితం మీద ఆశలు లేవని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 

 

 

Leave a Comment