పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేశ్?.. ఇక వైసీపీ తట్టుకోగలదా?

ఒంగోలులో నిర్వహించిన మహానాడు ఊహించిన దాని కంటే విజయవంతం కావడంతో టీడీపీ నేతల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. దీంతో తమ తదుపరి కార్యచరణపై ఫోకస్ చేస్తున్నారు. ఎన్నికల వరకు జనంలోనే ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రధాన కార్యదర్శి లోకేశ్ తో పాదయాత్ర చేయించాలని భావిస్తున్నారు.

మహానాడు ముగింపు సందర్భంగా విలేకరులతో లోకేశ్ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు పాదయాత్రపై ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయిలో వైఫల్యాలపై జగన్ ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీశామని, ఇకపై నియోజకవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యేలను కూడా నిలదీయాల్సి ఉందని అన్నారు. పార్టీ ఎలాంటి బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానని, ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు పాదయాత్రకు సిద్ధమని చెప్పారు. 

లోకేశ్ పాదయాత్ర ఇప్పుడు రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను ధరల పెరుగుదలపై నిలదీస్తున్నారు. ఇది ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారింది. ఇక లోకేశ్ పాదయాత్ర చేస్తూ నిలదీస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని, వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు తట్టుకోగలరా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  

Leave a Comment