షాకింగ్ : ఏడో తరగతి విద్యార్థితో ముగ్గురు పిల్లల తల్లి జంప్..!

ఈ సమాజం ఎటు పోతుంది? కామంతో కళ్లు మూసుకుపోయి పెద్ద, చిన్న తేడా లేకుండా పోతుంది.. ముగ్గురు పిల్లల తల్లి ఏడో తరగతి చదువుతున్న విద్యార్థితో పరారైంది. ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గోరఖ్ పూర్ లో జరిగింది. గోరఖ్ పూర్ లోని కంపియాగంజ్ ప్రాంతానికి చెందిన ఓ వివాహితకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

ఆ మహిళకు అదే ప్రాంతానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న విద్యార్థితో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో ఆ అబ్బాయితో ఆమె సన్నిహితంగా మెలిగింది. అయితే ఈనెల 10న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆ అబ్బాయిని తీసుకుని ఆ మహిళ పరారైంది. దీంతో ఆందోళనకు గురైన బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ముగ్గురు పిల్లల తల్లి, ఏడో తరగతి విద్యార్థితో వెళ్లిన వార్త ఆ గ్రామంలో కలకలం రేపింది.  

Leave a Comment