వాహనదారుల సేఫ్టీ దృష్ట్యా ట్రాఫిక్ రూల్స్ పై అనేక రకాలుగా అవగాహన కల్పిస్తున్నా.. ప్రజలకు మాత్రం అవి పట్టడం లేదు. దీనికి గమనించిన పోలీసులు ఇప్పుడు ట్రెండ్ పాలో అవుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. దీంతో జనానికిి ఈజీగి రీచ్ కావడానికి మీమ్స్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
తాజాగా ఉత్తరాఖండ్ పోలీసులు ఇలాంటి పనే చేశారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. కోహ్లీ డకౌట్ ను ఉత్తరాఖండ్ పోలీసులు వాడుకున్నారు. డకౌట్ అయి పెవిలియన్ కి వెళ్తున్న ఫొటోని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ‘హెల్మెట్ వేసుకుంటే సరిపోదు.. పూర్తి స్పృహతో వాహనం నడపాలి. అలా డ్రైవింగ్ చేయకపోతే కోహ్లీలా మీరు డకౌట్ అవుతారు’ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
हेलमेट लगाना ही काफ़ी नहीं है!
पूरे होशोहवास में गाड़ी चलाना ज़रूरी है,
वरना कोहली की तरह आप भी ज़ीरो पर आउट हो सकते हैं. #INDvEND #ViratKohli pic.twitter.com/l66KD4NMdG— Uttarakhand Police (@uttarakhandcops) March 12, 2021