టీమిండియా ఉమెన్ వన్డే కెప్టెన్ మిథాలి రాజ్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్ లో అన్నిఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్ ఉమెన్న్ గా రికార్డు నెలకొల్పింది. అలాగే అంతర్జాతీయ మహిళల క్రికెట్ లో ఈ ఫీట్ అందుకున్న రెండో క్రికెటర్ గా నిలిచింది. మొదటి స్థానంలో ఇంగ్లండ్ క్రీడాకారిణి చార్లెట్ ఎడ్వర్డ్స్ ఉంది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో మిథాలి రాజ్ ఈ ఫీట్ సాధించింది. మొత్తంగా భారత్ తరపున ఇప్పటి వరకు 10 టెస్టులు ఆడి 663 పరుగులు, 89 టీ20ల్లో 2,364 పరుగులు చేసింది. 212 వన్డేల్లో 6,974 పరుగులు చేసింది. మిథాలి రాజ్ 10 వేల పరుగుల మార్క్ అందుకున్న విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
What a champion cricketer! 👏👏
First Indian woman batter to score 10K international runs. 🔝 👍
Take a bow, @M_Raj03! 🙌🙌@Paytm #INDWvSAW #TeamIndia pic.twitter.com/6qWvYOY9gC
— BCCI Women (@BCCIWomen) March 12, 2021