విన్నర్స్ రన్ ది వరల్డ్..!

చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన నాయకులు..రాజకీయాల్లో వీరద్దరూ ప్రత్యర్థులు..ఇద్దరూ ముఖ్యమంత్రులుగా చేశారు. ఈ ఇద్దరు ప్రత్యర్థులు ఒకప్పుడు మంచి మిత్రులు..ఇది చాలా మందికి తెలియదు. వీరిద్దరి స్నేహం గురించి సినిమా తీస్తున్నాడు దర్శకుడు దేవా కట్టా..దీనికి ‘ఇంద్రప్రస్థం’ అని టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేశారు. 

ప్రపంచంలో జరిగే పోటీలన్నింటికీ  పర్పస్ ఒక్కటే..విన్నర్స్ ను ఎంచుకోవడం.. విన్నర్స్ రన్ ది వరల్డ్..ఆ పోటీలో అనుకోకుండా ఇద్దరు స్నేహితులు ఎదురైతే..ఆ ఆటకున్న కిక్కే వేరు..ఇది ‘ఇంద్రప్రస్థం’ లోని డైలాగ్.. ఇద్దరు రాజకీయ దిగ్గజాల స్నేహానికి, రాజకీయాల్లో వారి శత్రుత్వానికి, ఆ ఇద్దరికీ వారు అనుచరులు ఇచ్చే గౌరవానికి సమాన ప్రాధాన్యం ఇచ్చే సినిమా అని దేవా కట్టా అంటున్నారు. ప్రూడోస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్ష.వి మరియు తేజ.వి లు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం దేవా కట్టా హీరో సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అనంతరం ఇంద్రప్రస్థం సినిమాను పట్టాలెక్కించనున్నాడు. 

 

Leave a Comment