పెద్ద కుట్ర జరుగుతుంది..సీఎం జగన్ పై హీరో రామ్ సంచలన ట్వీట్..!

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.  ఈ ఘటనపై హీరో రామ్ సంచలన ట్వీట్ చేశాడు. ‘పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది..సీఎంని తప్పుగా చూపించడానికి..జగన్ గారు మీ కింద పనిచేసే కొంత మంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కి, మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది. వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం..’ అంటూ రామ్ ట్వీట్ చేశాడు. 

అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లిస్తున్నరని పేర్కొన్నారు. ‘హోటల్ స్వర్ణ ప్యాలెస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు’ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

 

Leave a Comment