గర్భవతిని చేసి భర్త పరార్.. భర్త ఇంటి ముందు బైఠాయించిన భార్య..!

ప్రేమిస్తున్నానని నమ్మించి గర్భం చేశాడు.. తర్వాత పెళ్లి చేసుకునున్నాడు. పెళ్లి అయిన 10 రోజుల తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో ఓ వివాహత తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు బైఠాయించింది.. ఈ ఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు డైలీ మార్కెట్ కు చెందిన నర్రు వందనను తన ఇంటి ఎదురుగా ఉన్న నర్రు చినబాబు రెండేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడ్డాడు. నిజమేనని అతడి మాటలు నమ్మి వందన గర్భవతి అయింది. తర్వాత పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. దీంతో వందనది ఎస్సీ కులం కావడంతో పెద్దలు అంగీకరించలేదని చినబాబు మాటమార్చాడు. ఈవిషయాన్ని గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ ఏడాది జూన్ 20న అమ్మవారి ఆలయంలో పెద్దలు పెళ్లి చేశారు. 

అయితే పెళ్లి తర్వాత అత్త, మామలు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో చీపురుపల్లిలోని కొత్తగౌడవీధిలో వందన అన్నయ్య నివాసం వద్ద ఉన్నారు. సరిగ్గా పది రోజులకు అంటే జూన్ 30న చినబాబు కనిపించకుండా పోయాడు. దీంతో తన అత్తమామలే భర్తను ఎక్కడో దాచారని, తనకు న్యాయం చేయాలని ఆదివారం అత్తారింటి ముందు బైఠాయించింది. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. 

Leave a Comment