పాక్ ప్లేయర్స్ తో ధోని ముచ్చట.. ఇది కదా క్రీడా స్ఫూర్తి.. వీడియో వైరల్..!

T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.. ఈ మ్యాచ్ తో పాకిస్తాన్ చరిత్ర తిరగరాసింది. వరల్డ్ కప్ ఈవెంట్లలో పాకిస్తాన్ పై భారత్ ఎప్పుడు కూడా ఓడిపోలేదు. కానీ నిన్నటి మ్యాచ్ లో భారత్ ఓటమిని అభిమానలు జీర్ణించుకోలేకపోతున్నారు. 

కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత కొన్ని దృశ్యాలు క్రీడాభిమానులను ఎంతో ఆకర్షించాయి. పాకిస్తాన్ ప్లేయర్స్ బాబర్ ఆజం, ఇమాద్ వసీం, షోయబ్ మాలిక్ తదితరులు టీమిండియా మెంటర్ ఎంఎస్ ధోనితో కాసేపు ముచ్చటించారు. ధోని చుట్టూ చేరి సందేహాలు అడిగారు. వాటికి ధోని సమాధానం ఇచ్చాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం వచ్చి ధోనితో కరచాలనం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పాక్ ఆటగాళ్లకు విసెష్ చెప్పాడు. దీనిపై నెటిజన్లు రియల్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

Leave a Comment