క్రికెట్ బ్యాట్ తో మర్మాంగాలపై కొట్టి భర్తను చంపిన భార్య..!

ఓ మహిళ తన భర్త మర్మాంగాలపై కొట్టి హత్య చేసింది. క్రికెట్ బ్యాట్ తోనూ, రోకలి తోనూ దారుణంగా చితకబాదింది. ఈ హత్యకు ఆమె తల్లి కూడా సహకరించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం పంచాయతీ నక్కపల్లిలో బుధవారం జరిగింది. 

వివరాల మేరకు గ్రామానికి చెందిన గోపీనాథ్ రెడ్డి(36)కి అదే గ్రామానికి చెందిన అత్త కూతురు సునీతకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. గోపీనాథ్ రెడ్డి కొన్నాళ్ల క్రితం బెంగళూరు వెళ్లి అక్కడే సొంతంగా క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. లాక్ డౌన్ కారణంగా నాలుగు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అత్తారింట్లోనే ఉంటున్నాడు. డ్యూలు కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ వారు కారును తీసుకెళ్లారు. 

దీంతో ట్రాక్టర్ కొనుగోలు చేసి ఉపాధి పొందాలని గోపీనాథ్ రెడ్డి భావించాడు. ట్రాక్టర్ కొనేందుకు నగలు ఇవ్వాలని భార్యను అడిగాడు. దీంట్లో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి గోపీనాథ్ రెడ్డి నగల విషయంపై భార్య, అత్తతో గొడవపడ్డాడు. ఆగ్రహం చెందిన భార్య క్రికెట్ బ్యాట్, అత్త రోకలితో మద్యం మత్తులో ఉన్న అతన్ని చితకబాదారు. 

ఈక్రమంలో అతని మర్మాంగాలకు తీవ్ర గాయాలయ్యాయి. పురుషాంగం కొంత తెగింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. సమచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. హత్య చేసింది తామే అంటూ భార్య, అత్త పోలీసులకు తెలిపారు. మృతునికి 9ఏళ్ల కుమారుడు ఉన్నాడు. 

Leave a Comment