భర్త ఆనందం కోసం…ప్రియురాలితో భర్తను కలిపిన భార్య..!

 భర్త ఆనందం కోసం ఓ భార్య తన జీవితాన్నే త్యాగం చేసింది. భర్త, అతడి ప్రియురాలిని కలిపి వారి వివాహానికి సహకరించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. భూపాల్ లోని ఓ జంటకు మూడేళ్ల కింద పెళ్లి అయింది. అయితే తన భర్త గతంలో ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లయిన కూడా అతడు ప్రియురాలిని మర్చిలేకపోతున్నాడు. దీంతో ప్రియురాలిని కూడా పెళ్లి చేసుకుంటానని, ముగ్గురం కలిసి సంతోషంగా ఉండవచ్చని భార్యతో చెప్పాడు భర్త. 

అయితే చట్ట ప్రకారం అలా కుదరదని భార్య భర్తకు చెప్పింది. మూడేండ్ల వివాహం తర్వాత భర్త ఆనందం కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. తన భర్తకు విడాకులు ఇచ్చి ప్రియురాలితో భర్తకు దగ్గరుండి పెళ్లి చేసింది. ఈ విషయాన్ని ఈ విడాకుల కేసును వాదించిన మహిళ న్యాయవాది పేర్కొన్నారు. ఆ భార్య ఎంతో ఉన్నతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందని చెప్పారు. 

Leave a Comment