టాయిలెట్ వాటర్ తో పానీపూరి..చితకబదిన జనాలు..!

పానిపూరీ అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. సాయంత్రం అయితే చాలు లొట్టలేసుకుని తింటుంటారు. ఇంతలా డిమాండ్ ఉన్న పానిపూరీని కొందరు వ్యాపారులు కల్తీ చేస్తుంటారు. తాజాగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఘోర ఘటన జరిగింది. ఓ పానిపూరీ బండి వ్యక్తి టాయిలెట్ కోసం ఉపయోగించే నీటిని పానిపూరీకి వాడే రసంలో కలిపాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జనాలు అతడిని చితకబాదారు. 

కొల్హాపూర్ లోని రంకాల లేక్ సమీపంలో ‘ముంబై కా స్పెషల్ పానీపూరి వాలా’ పేరుతో పానీపూరీ బండి నిర్వహిస్తున్నాడు. ఆ బండి ఆ ప్రాంతంలో బాగా ఫేమస్..అయితే ఓ రోజు ఆ పానీపూరీ బండి వ్యక్తి రోడ్డు పక్కన టాయిలెట్ బయట ఉన్న నీటిని తెచ్చి పానీపూరి రసంలో కలిపాడు. ఈ దారుణాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఆ వీడియో చూసిన జనాలు ఆగ్రహంతో ఊగిపోయారు. అతడి పానీపూరీ బండిని కింద పడేసి వస్తువులను నాశనం చేశారు. ఇంట్లో వండిన శుభ్రమైన ఆహారాన్ని కాకుండా బయటి తిండిని తినే వారు ఇప్పటికైన జాగ్రత్త పడాలి. ఇలాంటి అపరిశుభ్రమైన ఆహారాన్ని తిని రోగాలు తెచ్చుకునే కన్నా ఇంట్లో అమ్మ చేతి వంట తింటే చాలా మంచిది. 

 

Leave a Comment