గర్భగుడిని శుభ్రం చేస్తుండగా.. మూగవాడికి మాటలొచ్చాయ్..!

మూడేళ్ల క్రితం ప్రమాదంలో మాట కోల్పోయిన వ్యక్తికి తిరిగి మాటలొచ్చాయి.. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఆదివారం జరిగింది. ప్రస్తుతం ఇది స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. కేశంపేట గ్రామానికి చెందిన బ్రహ్మచారి అనే వ్యక్తి మూడేళ్ల క్రితం ప్రమాదవశాత్తు ఇంట్లో కింద పడ్డాడు. మెదడుకు గాయాలు కావడంతో అతడు మాట కోల్పోయాడు. 

వైద్యం చేయించే స్థోమతలేకపోవడంతో అలానే ఉండిపోయాడు..ఈక్రమంలో శనివారం గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయలో విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మచారి దీక్ష చేపట్టాడు. దీక్షలో ఉన్న బ్రహ్మచారి ఆదివారం గర్భగుడిని శుభ్రం చేస్తుండగా.. ఒక్కసారిగా పూనకం వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు.

మొదట గర్భగుడిలో ఉన్నప్పుడే మాటలు వచ్చాయి. బయటకు వస్తే రావడం లేదు. ఇది గమనించిన స్థానికులు స్వామి వారికి 11 బిందెలతో అభిషేకం చేశారు. దీంతో బ్రహ్మచారికి పూర్తిగా మాటలు వచ్చాయి. ప్రస్తుతం గ్రామంలో ఇది చర్చనీయాంశంగా మారింది. దీనిపై డిప్యూటీ డీఎంహెచ్ఓ మాట్లాడుతూ బ్రెయిన్ కి గాయం అయితే ఇలా మాటలు కోల్పోయే ఛాన్స్ ఉందని, గాయం మానిన తర్వాత అనుకోకుండా మాటలు తిరిగి రావచ్చని అన్నారు.. 

Leave a Comment