ఏలూరులో ‘ఉప్పెన’ తరహా ఘటన.. యువకుడి మర్మాంగంపై రోకలిబండతో..!

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో ‘ఉప్పెన’ సినిమా తరహా ఘటన జరిగింది. మండలంలోని నరసింహారావు పాలెంలో శ్రీకాంత్ అనే యువకుడి మర్మాంగంపై దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.  

వివరామ లేరకు నరసింహారావు పాలెం గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఓ యువతి వెంటపడుతున్నాడు. ఈ విషయం యువతి తండ్రికి తెలియడంతో అతడిపై కోపం పెంచుకున్నాడు. మాట్లాడుదామని ఆ యువకుడిని ఇంటికి పిలిపించాడు. ఓ గదిలో బంధించి యువకుడిని చిత్రహింసలు పెట్టాడు. రోకలి బండతో యువకుడి మర్మాంగాన్ని ఛిద్రం చేశాడు. 

తీవ్ర గాయం కావడంతో యువతి ఇంటి నుంచి 108 వాహనంలో ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నూజివీడు అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రస్తతం యువకుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

   

Leave a Comment