ఛార్జింగ్ పెట్టి పనిచేస్తుండగా.. పేలిన ల్యాప్ టాప్..!

వైఎస్సార్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ల్యాప్ టాప్ కి ఛార్జింగ్ పెట్టి పనిచేస్తుండగా పేలిపోయింది. ఈ ఘటనలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి గాయాలయ్యాయి. వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలంలోని మేకవారిపల్లెలో సుమలత అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇంట్లో తన ల్యాప్ టాప్ కి ఛార్జింగ్ పెట్టి పనిచేస్తోంది.. 

ఈక్రమంలో ఛార్జింగ్ పెట్టిన ల్యాప్ టాప్ ఉన్నట్టుండి పేలిపోయి మంటలు వ్యాపించాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుమలతకు ఒళ్లంతా బొబ్బలెక్కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆమె బెడ్ పై ఉండటంతో, బెడ్ తో పాటు బెడ్ షీట్ అంతా కాలిపోయింది.  

Leave a Comment