శివుడిని చూపిస్తా రండి.. నిత్యానంద బంపర్ ఆఫర్..!

వివాదాస్పద అధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామిజీ భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. గతంలో కైలాశ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన కైలాస దేశానికి వస్తే.. అక్కడ పరమ శివుడిని చూపిస్తానని హామీ ఇస్తున్నాడు. రెండు రాత్రులు, మూడు పగళ్లు తన దేశంలో ఉండే భాగ్యం కల్పిస్తాని చెబుతున్నాడు. 

ఈ అవకాశం పొందాలంటే ముందు వీసాకు దరఖాస్తు చేసుకోవాని సూచిస్తున్నాడు. కాకపోతే భక్తులు సొంత ఖర్చులతో ఆస్ట్రేలియాకు చేరుకోవాలని కండీషన్ పెట్టాడు. అక్కడి నుంచి అంతా.. తామే చేసుకుంటామని అంటున్నారు. ఆస్ట్రేలియా నుంచి చార్డెడ్ ఫ్లయిట్ లో కైలాస దేశానికి చేరుకోవచ్చన్నారు. 

తన దగ్గరికి వస్తే డైరెక్ట్ గా పరమ శివుణ్ని చూపిస్తామనని ప్రకటించాడు. మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండడం కుదరదని వెల్లడించారు. కైలాస యాత్ర కోసం చార్టెడ్ ఫ్లయిట్స్ అందుబాటులో ఉంటాయని, కైలాస వీసా కోసం మీరు ఈమెయిల్ పంపడం మొదలుపెట్టండి అంటూ పిలుపునిచ్చారు.   

 

Leave a Comment