సాయి తేజ్ వాడిన బైక్ ఏంటీ? ధర ఎంతో తెలుసా?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటి ఐకియా వైపు వెళ్తుండగా స్పోర్ట్స్ బైక్ నుంచి కిందపడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని చికిత్స కోసం హైటెక్ సిటీలోని మెడీకవర్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం జుబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కు తరలించారు. అయితే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ పరిస్థితి నిలకడగా ఉందంటూ అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ వాడిన బైక్ గురించి చర్చ జరుగుతోంది. ఆ బైక్ ఏదీ? దాని ధర ఎంత? అంటు ఆరా తీస్తున్నారు. కాగా అది ఒక స్పోర్ట్స్ బైక్. 660 సీసీ ఇంజన్ ను కలిగి ఉంది. ఈ ట్రంప్ బైక్ బరువు 228 కిజీలు ఉంటుంది. ఈ బైక్ ధర రూ.11 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉంటుంది. అనిల్ కుమార్ పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉన్న ఈ బైక్ TS07 GJ1258 నెంబర్ ప్లేటును కలిగి ఉంది. సాయి తేజ్ కి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం.. సమయం దొరికితే తన బైక్ మీద కానీ, స్నేహితుల బైక్ కాని తీసుకుని రైడింగ్ కు వెళ్తుంటాడు.    

Leave a Comment