‘వాట్సాప్ యూనివర్సిటీకి స్వాగతం.. ధమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ రుచి చూడండి’.. అంటూ కేటీఆర్ ట్వీట్ 

తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధంతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. 

తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీపై వరుసబెట్టి విమర్శలు చేస్తున్నారు. ఈక్రమంలో బీజేపీ సమావేశాలను ఎద్దేవా చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. అందమైన హైదరాబాద్ నగరంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి వాట్సాప్ యూనివర్సిటీకి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. జుమ్లా జీవులందరూ.. తమ దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ ని రుచి చూడాలన్నారు. అలాగే తెలంగాణలో ఉన్న ప్రాంతాలను సందర్శించి.. తమ తమ రాష్ట్రాల్లో వీటిని అమలు చేసేందుకు కనీసం ప్రయత్నించాలని ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే తెలంగాణలోని సందర్శన ప్రాంతాల ఫొటోలను ట్వీట్ చేశారు.  

Leave a Comment