తెలంగాణలో రెండో స్థానంలో టీఆర్ఎస్.. లేటెస్ట్ సర్వేలో షాకింగ్ రిజల్ట్..!

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్షాలన్నీ పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. 2018 తరహాలోనే సీఎం కేసీఆర్ ముందుస్తుకు వెళ్తారని భావిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు నిత్యం జనంలోనే ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ కూడా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ కేడర్ లో జోష్ నింపుతోంది.. అదే సమయంలో ఆయా పార్టీలు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ తమ బలాన్ని అంచనా వేసుకుంటున్నాయి. 

తాజాగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంతంగా నెల్లూరు జిల్లాకు చెందిన ఓ సంస్థతో సర్వే నిర్వహించుకున్నారని సమాచారం.. ఈ సర్వే అధికార టీఆర్ఎస్ కి షాకిచ్చేలా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీకీ 44 స్థానాలు మాత్రమే వస్తాయని వచ్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 54 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. ఇక బీజేపీకి మాత్రం కేవలం 14 సీట్లే వస్తాయని, ఎంఐఎం పార్టీ ఏడు సీట్లతో పాతబస్తీలో తమ పట్టు కాపాడుకుంటుందని  సర్వేలో వెల్లడైంది.  

Leave a Comment