వారంలో CAA అమలు చేేస్తాం.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

CAA in India : వారంలో రోజుల్లో పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలుులోకి వస్తుందని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ ప్రకటించారు. రాబోయే ఏడు రోజుల్లో పశ్చిమ బెంగాల్ లోనే కాదు.. దేశవ్యాప్తంగా CAA అమలు చేస్తామని స్పష్టం చేశారు. బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాలోని కక్ ద్వీప్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేేశారు. 

1971 తర్వాత భారత్ కి వచ్చిన వారు, ఆధాార్, కార్డు, ఓటర్ ఐడీలు ఉన్న వారంతా దేశ పౌరులేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెబుతున్నారని శాంతనూ ఠాకూర్ మండి పడ్డారు.  CAAని వ్యతిరేకిస్తున్న మమతాను టార్గెట్ గా పెట్టుకుని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశాారు. బెంగాల నుంచి టీఎంసీని గద్దె దించి.. 2026లో బీజేపీని ఎన్నుకోవాలని కోరారు.  

కాగాా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను టీఎంసీ ఖండించింది. కేవలం లోక్ సభ ఎన్నికల్లో లబ్ది కోసమే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించింది. ఎవరెన్ని చెప్పినా బెంగాల్ లో CAA అమలు కాదనిి స్పష్టం చేసింది.   

 

Leave a Comment