మసీదు శంకుస్థాపనకు సీఎం యోగిని ఆహ్వానిస్తాం : ముస్లిం సంఘాలు

అయోధ్యలో మసీదు నిర్మాణం శంకుస్థాపనకు తాను హాజరుకాబోనని యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ చేసిన వ్యాఖ్యలు ఎంత దూమారం లేపాయో తెలిసిందే. మసీదు నిర్మాణం శంకుస్థాపనపై ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ స్పందించింది. అయోధ్యలో మసీదు శంకుస్థాపనకు సీఎం యోగిని కచ్చితంగా ఆహ్వానిస్తామని ప్రకటించింది. 

ధన్నీపూర్ లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో మసీదు నిర్మాణం చేపడతామని, ఇందులో ఓ ఆస్పత్రి, ఓ గ్రంథాలయం, వంటశాల, ఓ అధ్యయన కేంద్రాలను కూడా నిర్మిస్తామని ఇండో ఇస్తామిక్ కల్చరల్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి అక్తర్ హుసేన్ తెలిపారు. మసీదు శంకుస్థాపనకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనడమే కాకుండా..ప్రజల సౌకర్యానికి నిర్మించే వాటికి ఆర్థిక సాయం కూడా అందిస్తారని వెల్లడించారు. 

Leave a Comment