మాకు జనసేనతో  మాత్రమే పొత్తు : పురందేశ్వరి

వైసీపీతో బీజేపీ పొత్తు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, తమకు జనసేనతో తప్ప ఎవరితోనూ పొత్తు లేదని బీజేపీ నేత పురందేశ్వరి తెలిపారు. బీజేపీతో వైసీపీ పొత్తు అంటూ జరుగుతున్న ప్రచారం గురించి ఆమె స్పందించారు. ఏపీలో జనసేనతో మాత్రమే కలిసి పని చేస్తామని స్పష్టీకరణ చేశారు. జగన్ వి ఒంటెద్దు పోకడలు అంటూ విమర్శించారరు. బీజేపీతో వైసీపీ పొత్తు అనేది అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. శాసనమండలి రద్దు భావ్యం కాదని పురందేశ్వరి విమర్శించారు. పీపీఏల రద్దు నుంచి రాజధాని మార్పు నిర్ణయం వరకు జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా సరైన పాత్ర పోషించడంలేదని ఆమె విమర్శించారు..

Leave a Comment