వాస్తవాలను ప్రచురించండి : వర్ల రామయ్య

మీడియా ముందే సాక్షి దిన పత్రికను తగులబెట్టిన వైనం

విజయవాడ : ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని వాస్తవాలను ప్రచురించాలని, ఆధారాలు లేకుండా రాతలు రాస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సాక్షి దినపత్రికను ఆయన తగులబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరాధార వార్తలు రాస్తూ వైసీసీ నేతలు శునకానందం, రాక్షసానందం పొందుతున్నారన్నారు. కేసుల గురించే వైసీపీ నేతలు ఢిల్లీకి వెళ్తున్నారన్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని సాక్షి పత్రికలో వాస్తవాలను ప్రచురించాలన్నారు. పత్రికా రంగం చాలా ప్రాధాన్యమైందని, అయినప్పటికీ కూడా తగులబెడుతున్నామంటే ఎంతటి పనికిమాలిన రాతలు రాసుంటారని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. చంద్రబాబుని వికారంగా చూపిస్తున్నారన్నారు. ఫ్యాక్షనిస్టుల మెంటాలటీతో ప్రవర్తిస్తున్నారన్నారు. పారదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వం రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రహస్యంగా ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏముందన్నారు. పైకి గంభీరంగా కనపడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ లోపల భయపడుతున్నారని వర్ల రామయ్య అన్నారు.

 

Leave a Comment