VLCC Femina Miss India 2020 Winner Manasa Varanasi
ముంబాయి హయ్యత్ రిజెన్సీలో బుధవారం జరిగిన విఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా 2020 విజేతగా తెలంగాణ అమ్మాయి మానస వారణాసి నిలిచింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన మాన్యా సింగ్ రన్నరప్ గా, హర్యానాకు చెందిన మనికా హియోకండ్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా కిరీటం దక్కించుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా బాలీవుడ్ తారలు నేహా ధూపియా, చిత్రాంగదా సింగ్, పులకిత్ సామ్రాట్, ప్రముఖ డిజైనర్ దంపతులు ఫల్గుణి, షేన్ పీకాక్ వ్యవహరించారు.
కాగా, మిస్ ఇండియాగా నిలిచిన 23 ఏళ్ల మానస వారణాసి హైదరాబాద్ లోని గ్లోబల్ ఇండియన్ లో స్కూల్ చదువుకుంది. వాసవి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేసింది. బీటెక్ పూర్తికాగానే మానస ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ ఛేంజ్ అనలిస్ట్ గా పనిచేస్తోంది.
View this post on Instagram
మానస ఇంజినీరింగ్ పూర్తి అయ్యాక ఎఫ్బీబీ-ఫ్యాషన్ హబ్ కలర్స్ టీవీ ఫెమినా మిస్ ఇండియా 2019 తెలంగాణ ఫైనలిస్ట్ గా ఎంపికయ్యారు. మానసకు సంగీతం, పుస్తకాలు చదవడం, యోగా చేయడం, మ్యూజిక్ వినడం అంటే చాలా ఇష్టం. కొత్త వాటిని తెలుసుకోవాలనే ఉత్సుకత ఉండేది. ప్రతి చిన్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచించే మనస్తత్వం ఆమెది. విభిన్నంగా ఆలోచించడమే ఆమెను విజయానికి దగ్గర చేసింది.
View this post on Instagram