ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీద్ర సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు.. ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికరమైన వీడియోను ఆయన పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన రోడ్డు గుంతలకు పరిష్కారం చూపే ఓ వీడియోను షేర్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
రోడ్డుపై ఉన్న గుంతలను ఆధునిక టెక్నాలజీతో ‘ప్యాచెస్’ ద్వారా పూడ్చి వేస్తున్న వీడియోను ఆయన పోస్టు చేశారు. దేశంలోని రోడ్లు, గుంతలకు ఇది ఒక మంచి సొల్యుషన్ అన్నారు.. ఈ ఆవిష్కరణ ఇండియాకు అవసరమన్నారు. కొన్ని బిల్డింగ్ లేదా కన్ స్ట్రక్షన్ మెటీరియల్ కంపెనీలు ఈ టెక్నాలజీని ఉపయోగించాలని, ఈ సంస్థతో సంప్రదించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆనంద్ మహీంద్ర కోరారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ టెన్నాలజీ చాలా బాగా ఉందని కొందరు, మరి కొందరైతే ఇది మన దేశంలో గుంతలను పూడ్చటానికి సరిపోదని అంటున్నారు.
I’d say this is an innovation that’s essential for India. Some building/construction material company needs to either emulate this or collaborate with this firm and get it out here pronto! pic.twitter.com/LkrAwIOP1x
— anand mahindra (@anandmahindra) August 3, 2022