నడిరోడ్డుపై యువతి రచ్చ.. ఓ వ్యక్తిని ఎగిరెగిరి కొడుతూ ఓవరాక్షన్.. వీడియో వైరల్..!

ఉత్తరప్రదేశ్ లో నడిరోడ్డుపై ఓ యువతి రచ్చ చేసింది. ఓ వ్యక్తిని నాన్ స్టాప్ గా చితకబాదింది. ఈ ఘటన లక్నోలోని అవధ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఆ వీడియోలో ఓ యువతి ఒక వ్యక్తిని నడిరోడ్డుపై కొట్టింది. ఆ వ్యక్తిని కొడుతుంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్ తో సహా అక్కడ ఉన్న వారందరూ చూస్తూ ఉండిపోయారు. ఎందుకు కొడుతున్నావు అంటూ కారణం అడుగుతుంటే.. ఆ వ్యక్తి ఫోన్ లాక్కుని పగలకొట్టింది. ఆ వ్యక్తిని ఎగిరెగిరి మరీ కొడుతూనే ఉంది. 

అంతేకాదు అడ్డొచ్చిన మరో వ్యక్తిని కూడా కాలర్ లాగి కొట్టింది. తనను ఢీకొట్టిన కారణంగానే వ్యక్తిని కొట్టినట్లు ఆ యువతి మాటల్లో తెలుస్తోంది. అయితే ఏం జరిగిదనే దానిపై స్పష్టత రాలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని ‘మేఘ్ అప్ డేట్స్’ అనే ట్విట్టర్ పేజీ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

 

Leave a Comment