సమాజంలో హింస పెరుగుతోంది : మోహన్ భగవత్

న్యూఢిల్లీ : సమాజంలో పాలకులపై అసంతృప్తి పెరుగుతోందని, ఇదే సమయంలో హింసా కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ పేర్కొన్నారు. మూడో ప్రపంచ యుద్ధానికి సయమం వచ్చిందేమోనని తనకు అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

రెండు ప్రపంచ యుద్ధాల తరువాత ప్రపంచం కుగ్రామైందన్నారు. కానీ ఇప్పుడు మూడో యుద్ధ భయం వెన్నాడుతోందని తెలిపారు. ఇది మరోరకంగా మన ముందుకు రాబోతోందన్నారు. యజమానులు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు..ఇలా ప్రతి ఒక్కరూ నిరసనలకు దిగుతున్నారని చెప్పారు. ఈ నిరసనలతో ప్రతి ఒక్కరూ అసంతృప్తితో ఉన్నారన్నారు. మిల్లు ఓనర్లు, కార్మికులు నిరసనలకు దిగుతున్నారన్నారు. ఎవరిలోనూ సంతోషం లేదని తెలిపారు. అభివృద్ధి చెందిన ప్రపంచంలో నివసిస్తున్న వారిలో అసంతృప్తి తాండవిస్తోందని అన్నారు. 100 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులతో ఇప్పటి పరిస్థితులను పోల్చుకోండని, పానిపల్ యుద్ధంలో ఎవరు గెలిచిందనే వార్త పూనాకు చేరేందుకు నెల సమయం పట్టిందని, ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు.

Leave a Comment