విజయనగరం జిల్లాలో దారుణం.. కాబోయే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు..!

విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. పూసపాటిరేగ మండలం చౌడువాడ గ్రామంలో ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ యువకుడిని అడ్డుకోబోయిన యువతి అక్క, ఆమె కుమారుడికి కూడా గాయాలయ్యాయి. స్థానికులు గాయపడ్డ ముగ్గురినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రాంబాబు అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. 

ఇటీవల బాధిత యువతితో రాంబాబుకు పెళ్లి నిశ్చయమైంది. అయితే ఆ యువతి మరో యువకుడితో మాట్లాడుతోందన్న అనుమానంతో రాంబాబు పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. గురువారం రాత్రి ఇరు కుటుంబాలను పిలిచి పోలీసులు రాజీ కుదుర్చారు. పోలీసుల సూచనలతో వివాహం చేసుకునేందుకు రాంబాబు ఒప్పుకున్నాడు. అయితే మళ్లీ ఏం జరిగిందో తెలియరాలేదు. గురువారం అర్ధరాత్రి సమయంలో రాంబాబు యువతిపై దారుణానికి పాల్పడ్డాడు. 

 

Leave a Comment