స్నేహితుడి పెళ్లికి గిఫ్ట్ గా బాండ్ పేపర్.. ఏం రాశారో తెలుసా?

పెళ్లిలో కానుకలు ఇవ్వడం సహజం. స్తోమతకు తగ్గట్టు కానుకలు ఇస్తుంటారు. కానీ తాజాగా పెళ్లి కొడుకు స్నేహితులు తమ ఆర్థిక పరిస్థితులను తెలియజేస్తూ పెళ్లికానుకగా ఒక బాండ్ పేపర్ ను కానుకగా ఇచ్చారు. ప్రస్తుం ఉన్న పరిస్థితుల్లో మీ పెళ్లికి బహుమతులు ఇవ్వలేమని, ప్రభుత్వ పథకాల నుంచి తమకు డబ్బులు రాగానే గిఫ్ట్ లు ఇస్తామని రూ.10 బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. ఏపీకి చెందిన స్నేహితులు రాసిన ఈ బాండ్ పేపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఆ బాండ్ పేపర్ లో ఏ రాశారంటే.. ‘ప్రియ మిత్రుడు కరోతు రాముకు మిత్రబృందం రాసి ఇచ్చు హామీ పత్రం.. మిత్రమా.. నీ వివాహము జరుగుట మాకు ఎంతో ఆనందకరం. ఈ శుభ సందర్భంగా నీకు మంచి బహుమతి బహుకరించాలని అనుకున్నాము. కానీ కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా పనులు లేక చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాము. ఇప్పుడు నీకు బహుమతి ఇచ్చే అవకాశం లేనందున త్వరలో డ్వాక్రా డబ్బులు గానీ, అమ్మవడి డబ్బులు కాని, రైతు భరోసా కాని ఎటువంటి డబ్బులు మా అకౌంట్ లో పడినా మేమందరం ఆ డబ్బులతో నీకు మంచి బహుమతి ఇస్తామని వ్రాసి ఇచ్చుచున్నాము. అలా ఇవ్వని పక్షాన నీవు తీసుకొను చట్టపరమైన ఏ చర్యలకైనా మేము పూర్తి బాధ్యత వహిస్తామని అంగీకరిస్తున్నాము’ అని ఆగస్టు 13, 2021న చినమాడ కనకరాజు పేరిట మిత్రబృందం రూ.10 ల నోటరీ బాండ్ పేపర్ రాసి బహుకరించింది. 

Leave a Comment