వైసీపీకి విజయమ్మ రాజీనామా.. ప్లీనరీలో సంచలన ప్రకటన..!

వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.  పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్ షర్మిలకు అండగా ఉండేందుకే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. షర్మిలకు రాజకీయంగా అండగా ఉంటానని, తల్లిగా జగన్ కు ఎప్పుడూ మద్దతుగా ఉంటానని విజయమ్మ తెలిపారు. 

కొంత మంది తమపై బురద జల్లుతున్నారని, విమర్శలకు, వక్రీకరణకు తావు లేకుండా తాను గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నానని విజయమ్మ ప్లీనరీలో వెల్లడించారు. వైఎస్ఆర్ అభిమానులు తనను క్షమించాలని కోరారు. రాజకీయం అంటే దుష్ప్రచారాలు, వెన్నుపోట్లు కాదని, వైఎస్సార్ లేని లోటును తనకు ఎవరూ తీర్చలేరని అన్నారు. ఇలాంటి వాటికి తావివ్వకుండా ఉండేందుకు వైసీపీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. 

 

Leave a Comment