స్టార్ హీరో విక్రమ్ కు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఐసీయూలో ఉండడంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
నేడు సాయంత్రం ఆయన నటించిన పొన్నియన్ సెల్వమ్ సినిమా టీజర్ కు ఆయన హాజరు కావాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆయనకు గుండెపోటు రావడంతో అంతా షాకవుతున్నారు. మైల్డ్ హార్ట్ ఎటాక్ కావడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.. త్వరలోనే ఆయన్ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.