‘పిల్లలను బాగా చేసుకో’.. భార్యకు వీడియో కాల్ చేసి వ్యక్తి ఆత్మహత్య..!

భార్యకు వీడియో కాల్ చేసి ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగింది. వివరాల మేరకు ఏపీలోని వత్సవాయి మండలం వేమవరం గ్రామానికి చెందిన రుంజా అశోక్(32) ప్రైవేట్ వాహనం డ్రైవర్ గా పని చేసేవాడు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా అతనికి పని దొరకలేదు.

అప్పటి నుంచి ఇంటి వద్దే ఖాళీగా ఉండేవాడు. అతని భార్యది కాపుగల్లు కావడంతో ఏదైనా పని చేసుకుందాని నెల రోజుల కింద కోదాడ వచ్చారు. అక్కడ అద్దె ఇల్లు తీసుకుని ఉంటున్నారు. అయితే అక్కడ కూడా అతనికి పని దొరకలేదు. దీంతో అశోక్ తాగుడుకు అలవాటు పడ్డాడు. 

అద్దె ఇల్లు, కుటుంబ పోషణ భారమైంది. దీంతో భార్య పిల్లలను పుట్టింటికి పంపించేశాడు. ఈక్రమంలో శుక్రవారం భార్యకు వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. భార్య వద్దని బతిమాలింది. అయినా వినలేదు. పిల్లలను మంచి చూసుకో అని చెప్పాడు. తర్వాత గదిలోని ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే వారు కోదాడకు వచ్చి చేసేసరికి అప్పటికే చనిపోయి ఉన్నాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.   

 

Leave a Comment