ఒక ఆలయంలో నీరు తాగినందుకు ఓ మైనర్ ముస్లిం అబ్బాయిని ఓ వ్యక్తి కనికరం లేకుండా దారుణంగా కొట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆ వీడియోలో శ్రింగి నందన్ యాదవ్ అనే వ్యక్తి ఓ బాలుడిని పట్టుకుని నీ పేరు ఏంటీ? నీ తండ్రి పేరు ఏంటీ? అని అడిగాడు. బాలుడు ముస్లిం పేరు చెప్పాడు. ఇక్కడ ఎందుకు వచ్చావ్ అని ఆ వ్యక్తి బాలుడిని అడిగాడు.. అంటే నీళ్లు తాగేందుకు వచ్చానని బాలుడు సమాధానం ఇచ్చాడు.
అంతే బాలుడు ముస్లిం అని తెలియడంతో నందన్ యాదవ్ ఏ మాత్రం కనికరం లేకుండా బాలుడిని అతి దారుణంగా చితకబాదాడు. కింద పడేసి కాళ్లతో కొట్టాడు. ఆ బాలుడు తప్పించుకునేందుక ప్రయత్నించినా వదలకుండా దారుణంగా కొట్టాడు. కొట్టడాన్ని ఎవరో వీడియో రికార్డు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. పోలీసులు ఆ వీడియో ద్వారా వ్యక్తిని గుర్తించి అరెస్టు చేశారు.
Horrific!! A mob of Hindu extremists viciously assault a Muslim boy for drinking water from a temple in Ghaziabad, Uttar Pradesh.
The perpetrators know their violence has the tacit approval of the state, so they uploaded the attack on social media! pic.twitter.com/pkAgHrEzbe
— CJ Werleman (@cjwerleman) March 12, 2021