‘ఇక్కడ కథ మీది.. కల మీది.. రండి గెలుద్దాం’.. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమో రిలీజ్..!

‘కౌన్ బనేగా కరోడ్ పతి’ హిందీలో ఎంత సక్సెస్ అయిందో మీకు తెలిసిందే. ఆ కార్యక్రమాన్ని తెలుగు వర్షన్ లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో మా టీవీలో ప్రసారం చేశారు. దానికి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమం 2014లో ప్రారంభమై ఎంతో ఆదరణ పొందింది. ఎంతో మంది బహుమతులు కూడా గెలుచుకున్నారు. 

అయితే ప్రస్తుతం ఈ ప్రోగ్రాం హక్కు జెమినీ టీవీ దక్కించుకుంది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ చిన్ని చిన్న మార్పులతో త్వరలో ప్రసారం కానుంది. ఈ ప్రోగ్రాంకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ ప్రోగ్రాం కు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ పై ప్రోమోను కూడా షూట్ చేశారు. ఈ ప్రోమోకు దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్ చేశారు. 

తాజాగా ఈ ప్రోమోను జెమినీ టీవీ విడుదల చేసింది. ‘ హాయ్ ఈ ఆట గురించి నాకంటే మీకే బాగా తెలుసు’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ప్రోమోను స్టార్ట్ చేస్తాడు. ‘ఇక్కడి నుంచి మీరు ఎంత పట్టుకెళ్తారో నేను చెప్పలేను. కానీ లైఫ్ లో నేను గెలవగలుగుతాను అనే కాన్ఫడెంట్ ను కచ్చితంగా పట్టుకెళ్తారు. ఇక్కడ కథ మీది.. కల మీది.. ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులో’ అంటూ ప్రోగ్రాంపై ఆసక్తి పెంచింది.

                                                                                                              

Leave a Comment