ఉత్తరప్రదేశ్ లో ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. పీపీఈ కిట్ ధరించిన ఓ వ్యక్తి, మరో వ్యక్తితో కలిసి కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని బ్రిడ్జిపై నుంచి నదిలో పడేశారు.. ఈ ఘటన మే 28న బలరాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పట్టపగలే బ్రిడ్జిపై వాహనాలు తిరుగుతున్న సమయంలోనే మృతదేహాన్ని నదిలో పడేశారు. ఈ వీడియోను అటువైపుగా కారులో వెళ్తున్న వ్యక్తులు తీశారు.
కాగా, నదిలో పడేసింది కరోనా రోగి మృతదేహమేనని బలరామ్ పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బీబీ సింగ్ వెల్లడించారు. ఇప్పటికే బంధువులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా మే 25న చికిత్స కోసం ఆస్పత్రిలో చేరగా, పరిస్థితి విషమించి మే 28న చనిపోయాడు. అతడి మృతదేహాన్ని కోవిడ్ నిబంధనల ప్రకారం అతడి బంధువులకు అప్పగించారు. అయితే వారు ఆ మృతదేహాన్ని నదిలో పడేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
In UP’s Balrampur district, video of body of man being thrown in the river from a bridge has surfaced. The body was of a man who succumbed to Covid on May 28. pic.twitter.com/DEAAbQzHsL
— Piyush Rai (@Benarasiyaa) May 30, 2021