వైసీపీ రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల..!

ప్రజలందరి దీవెనలతో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోగలిగామని సీఎం జగన్ వెల్లడించారు. ఆదివారం వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రెండేళ్లలోనే 94.5 శాతం హీమీలను పూర్తి చేశామన్నారు. రాబోయే కాలంలో ఇంకా మంచి చేసేందుకు శక్తి ఇవ్వాలని దేవున్ని కోరుతున్నాని చెప్పారు.

86 శాతం ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందని సీఎం జగన్ వెల్లడించారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.95,528 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామని, మరో 36,197 కోట్లు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, జగనన్న తోడు, సంపూర్ణ పోషణ, ఇళ్ల స్థలాలు, వైఎస్సార్ కంటి వెలుగు ద్వారా ప్రజలకు అందించామన్నారు. రెండేళ్ల పాలనలో అందరికీ మంచి చేశానన్న నమ్మకం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు.    

 

Leave a Comment