తూర్పు గోదావరి జిల్లాలో దారుణం.. బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం..!

ఓ బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు బొబ్బిల్లంక గ్రామంలో బూసి సతీష్(23) అనే యువకుడు గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. ఇంటింటికీ తిరిగే క్రమంలో సతీష్ అదే గ్రామానికి చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడు. 

ప్రభుత్వ పథకాల పేరుతో సతీష్ తరచూ బాలిక ఇంటికి వెళ్లేవాడు. ఈక్రమంలో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఇంటికి వెళ్లాడు సతీష్.. ఎవరూ లేని సమయం చూసి బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయంతో ఆ బాలిక ఇంట్లో విషయం చెప్పలేదు..

అప్పటి నుంచి బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఏం జరిగిందంటూ ఆమెను ప్రశ్నించారు. దీంతో జరిగిన విషయాన్ని ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ సతీష్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది..

Leave a Comment