యూట్యూబ్ ద్వారా భారీగా సంపాదిస్తున్న కేంద్ర మంత్రి.. ఎంతో తెలుసా?

కరోనా లాక్ డౌన్ ఎంతో మంది జీవితాలను తలకిందులు చేసింది. పనులు లేక కొంత మంది రోడ్డున పడితే.. సెలబ్రెటీలు మాత్రం ఇంట్లో కూర్చొని సంపాదించుకున్నారు. అలా సంపాదించిన వారిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా నెలకు రూ.4 లక్షలు సంపాదించారు. గుజరాత్ లోని భరూచ్ లో ఢిల్లీ-ముంబాయి ఎక్స్ ప్రెస్ వే పనుల పురోగతిపై సమీక్షించిన సందర్భంగా ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.. 

‘కరోనా లాక్ డౌన్ సమయంలో తాను ఇంట్లో ఉండి రెండు రకాల పనులు చేశాను. చెఫ్ గా మారి ఇంట్లో వంట చేశాను. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనేక లెక్చర్లు ఇచ్చాను. విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఆన్ లైన్ లో దాదాపు 950 కిపైగా లెక్చర్లు ఇచాను. ఆ వీడియోలన్నీ యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేశాను. ఆ యూట్యూబ్ చానెల్ కి వ్యూస్ పెరగడంతో యూట్యూబ్ నాకు నెలకు రూ.4 లక్షలు చొప్పున రాయల్టీగా చెల్లిస్తోంది’.. అంటూ నితిన్ గడ్కరీ వివరించారు. ప్రస్తుతం ఆయన చానెల్ కు రెండు లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.     

 

Leave a Comment