‘నాకు న్యాయం కావాలి’.. ప్రధాని మోడీకి బాలుడి విజ్ఞప్తి.. వీడియో వైరల్.. 

నాకు న్యాయం కావాలంటూ అసోంకు చెందిన నాలుగేళ్ల బాలుడు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2016, డిసెంబర్ 26న కచార్ సిల్చార్ పట్టణంలో కొంతమంది దుండగులు ఆ బాలుడి తండ్రిని చంపేశారు. ఆ సమయంలో ఆ బాలుడి వయస్సు మూడు నెలలు.. ఆ కేసులో ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేకపోయారు. దీంతో తనకు న్యాయం చేయాలని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలను రిజ్వాన్ సాహిద్ లస్కర్ అనే బాలుడు విజ్ఞప్తి చేశాడు.. 

‘నా పేరు రిజ్వాన్ సాహిద్ లస్కర్.. సార్ నాకు మూడు నెలల వయస్సు ఉన్నప్పుడు, నా తండ్రిని 11 మంది దుండగులు డిసెంబర్ 26, 2016న సిల్చార్ లోని సోనాయ్ రోడ్డులో దారుణంగా చంపారు. ఈ కేసులో హంతుకులను నా కుటుంబానికి న్యాయం చేయండి’ అంటూ ప్రధానిని, హోంత్రిని, అసోం సీఎంను అభ్యర్థించాడు. ఐ వాంట్ జస్టిస్ అనే వాక్యంతో కూడిన ప్లకార్డును ప్రదర్శించాడు. బాలుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

Leave a Comment