కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి..!

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కరోనాకు బలయ్యాడు. ఇటీవల కరోనా బారినపడిన చోటా రాజన్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. తీహార్ జైల్లో ఉన్న చోటా రాజన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 26న అధికారులు ఎయిమ్స్ కు తరలించారు. 

అప్పటి నుంచి ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణించింది. చోటా రాజన్ పై మహారాష్ట్రలో 70కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. తొలుత దావుద్ అనుచరుడిగా ఉన్న రాజన్.. దావుద్ తో విభేదాల కారణంగా మరో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. అతడిని 2015లో ఇండోనేషియాలో అరెస్ట్ చేశారు. 

Leave a Comment